Sunday, May 5, 2024

AP : పోలీస్ స్టేష‌న్‌ను ప్రారంభించిన సీఎం జగన్

కడప- ప్రభ న్యూస్ బ్యూరో
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో ప‌ర్య‌టించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో రూ. 1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ల ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులను సీఎం అభినందించారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎం. పి. వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డి ఐ జి శెంథిల్ కుమార్, ఏస్ పి శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎంపిటిసి గంగ రత్నమ్మ, జడ్పిటిసి రవి కుమార్, రెడ్డి, ఎంపిపి లక్ష్మీ గాయత్రి, ఇడుపులపాయ సర్పంచు నాగమ్మ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement