Sunday, May 5, 2024

కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జ‌గ‌న్ అభినందనలు


బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ సింగిల్స్ ఫైనల్‌లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడిగా కిడాంబి శ్రీకాంత్ సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశం గర్విస్తుందన్నారు. భవిష్యత్తులో ఉజ్వలమైన కెరీర్‌తో పాటు మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. కిదాంబి శ్రీకాంత్ ను అభినందించిన విష‌యాన్ని ఆయ‌న కూ యాప్ ద్వారా పంచుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement