Friday, May 3, 2024

లారీ కింద పడి క్లీనర్ మృతి

కదులుతున్న లారీ ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారీ అదే లారీ కింద పడి క్లీనర్ మృతి చెందాడు ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి చెందిన లారీలో జొన్న తాళి వద్ద ఉన్న అమరావతి స్పిన్నింగ్ మిల్లుకు కాటన్ బెళ్ళ లోడు వచ్చింది. గేటు వద్ద పర్మిట్ లెటర్ చూపేందుకు దిగిన క్లీనర్ మళ్లీ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, డ్రైవర్ లారీ స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు. ఆ సమయంలో క్లీనర్ జారి కింద పడ్డాడు. ఈ క్రమంలో లారీ వెనుక చక్రాల కింద పడి మృతి చెందాడు. దీంతో డ్రైవర్ లారీ దిగి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ పరారీలో ఉండటంతో ఇతర వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement