Friday, April 26, 2024

ప్రకాశంలో పొలిటికల్ హీట్.. వైసీపీ దాడిలో టీడీపీ నేత మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయుల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ వర్గీయుడు లక్కీ పోగు సుబ్బారావు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సూచన మేరకు దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో నరసరావుపేట నియోజకవర్గం టిడిపి నేత చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. గ్రామాలలో టిడిపి కార్యకర్తలపై వైసిపి వర్గీయులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో శాంతియుత వాతావరణం ఉండే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని చదలవాడ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement