Saturday, July 27, 2024

AP | వారంలో పొత్తులపై క్లారిటీ – బీజేపీ

అమరావతిలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు ముగిశాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో ఈ సమావేశాలు నిర్వహించారు. శివప్రకాష్ వరుసగా 125 మందికి పైగా నేతలను కలిశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టతపై సమీక్ష నిర్వహించారు. ఏయే నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.

అన్నింటికీ మించి పొత్తులపై ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. పొత్తులపై తమ అభిప్రాయాలను రాష్ట్ర నేతలు శివప్రకాష్ కు వివరించారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేతలకు చెప్పారు. ఈ రెండు రోజుల సమావేశాల వివరాలను బీజేపీ నాయకత్వానికి శివప్రకాష్ నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పొత్తులపై వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement