Friday, May 17, 2024

శ్రీ‌వారి దర్శనానికి వచ్చిన సీజేఐ ఎన్వీ రమణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ శనివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం పద్మావతి అతిథి గృహాం వద్దకు చేరిన ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఈవో డాక్ట‌ర్ కేఎస్‌ జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తదితర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఏర్పాటు చేసిన 15రకాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, టీటీడీ, వైఎస్ఆర్ ఉద్యాన‌ విశ్వ‌విద్యాల‌యం డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో ఆక‌ర్ష‌ణీయంగా తయారుచేసిన శ్రీ‌వారి ఫొటోలు, కీ చైన్లు, పేప‌ర్ వెయిట్లతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. అంతకు ముందు జస్టిస్ ఎన్వీ రమణ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలను సందర్శించారు. అక్కడి వేణుగోపాల స్వామి సేవలో పాల్గొని గో తులాభారం చెల్లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement