Monday, April 29, 2024

చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నలుగురు దుండగులు సురేష్ అనే వ్యక్తిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో అధికారులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత నిందితులు రాజేంద్ర, మనోహర్, గణేష్, నాగభూషణం పరారయ్యారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తియాదమరిలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement