Monday, May 6, 2024

గురుమూర్తికి కారు, చింతా మోహన్‌కు ఆస్తులు లేవు.. రత్నప్రభ కు రూ.19.50 కోట్ల ఆస్తులు

నెల్లూరు: తొమ్మిదిసార్లు తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి పేరిట కారు లేదు. భాజపా అభ్యర్థిని రత్నప్రభకు దాదాపు రూ.19.50 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలివీ..
గురుమూర్తి కుటుంబ ఆస్తులు రూ.47.25 లక్షలు

  • వైకాపా అభ్యర్థి ఎం.గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం రూ.47.25 లక్షలు.
  • ఆయన పేరిట రూ.10,66,515 విలువైన చరాస్తులున్నాయి. భార్య నవ్యకిరణ్‌ పేరు మీద రూ.24,92,529 విలువైన చరాస్తులున్నాయి. ఇందులో గురుమూర్తి భార్య పేరిట రూ.7 లక్షల విలువైన కారు ఉంది.
  • ఏర్పేడు మండలంలో మన్నసముద్రం గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి (డీకేటీ), 2,610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.5 లక్షలు.
  • వీరికి అప్పులు లేవు. క్రిమినల్‌ కేసులూ లేవు.
  • గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్‌ దగ్గర రూ.2.92 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం, డెలీనా నిక్షాల్‌ దగ్గర రూ.3.73 లక్షల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.
    రత్నప్రభ కుటుంబ ఆస్తులు రూ.24.68 కోట్లు
    భాజపా అభ్యర్థి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ.24,68,52,141. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.19,57,75,095. రత్నప్రభ భర్త ఎ.విద్యాసాగర్‌ పేరున ఉన్న ఆస్తులు రూ.5,10,77,146.
  • రత్నప్రభ చేతిలోని నగదు రూ.25,000
  • వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రూ.2.81 కోట్లు, బాండ్ల రూపంలో రూ.28 వేలు, తపాలా పొదుపుఖాతాలో రూ.4 లక్షలు
  • రూ.52 లక్షల విలువైన 1,250 గ్రాముల బంగారం, రూ.1.95 లక్షల విలువైన 3 కేజీల వెండి
  • రూ.16 లక్షల విలువైన రెండెకరాల వ్యవసాయ భూమి, రూ.3 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి
  • ఎస్‌బీఐలో ఆమెపేరిట రూ.2.43 లక్షల రుణం ఉంది.
  • ఎ.విద్యాసాగర్‌ పేరిట కోటి విలువైన చరాస్తులు, రూ.4.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకులో రూ.17.30 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు.
Advertisement

తాజా వార్తలు

Advertisement