Wednesday, May 1, 2024

దొంగ ఓట్ల‌తో ప్ర‌జాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తున్న పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి – నారా లోకేష్….

తిరుప‌తి – తిరుప‌తి ఉప ఎన్నిక‌ల పోలింగ్ లో దొంగ ఓట్ల క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది…. బ‌య‌ట నుంచి వ‌చ్చిన వేలాది వైసిపి కార్య‌క‌ర్త‌లు నకిలీ ఓట‌ర్ ఐడిల‌తో ఓట్లు వేస్తున్నార‌ని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు, కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఇప్ప‌టికే ఫిర్యాదు చేశారు.. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సైతం దొంగ ఓట్ల భాగోతంపై స్పందిస్తూ ట్విట్ చేశారు. ‘పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు’ అని ఆరోపించారు. ‘పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ క‌ల్యాణ మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు’ అని ట్విట్ చేశారు. ‘తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల నుంచి ‌తర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి’ అని లోకేష్ ట్విట్ట‌ర్ ద్వారా డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement