Friday, April 26, 2024

Tirumala : తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందుల‌కు క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండ‌గా.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 79,471 మంది భక్తులు దర్శించుకోగా 36,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4. 90 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement