Saturday, April 27, 2024

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని కాణిపాకం దగ్గర పాల ట్యాంకర్ ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. తిరుపతి-బెంగళూరు ఆరులైన్ల రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement