Wednesday, May 15, 2024

నవోదయలో ప్రథమ ర్యాంకు సాధించిన విశ్వం విద్యార్థి

తిరుపతి సిటీ : జాతీయ స్థాయిలో 2022 ఏప్రిల్ 6వ తేదీన జరిగిన జవహర్ నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలతాల్లో తిరుపతికి చెందిన విశ్వం విద్య సంస్థల విద్యార్థి ఏ.పవన నరసింహ జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకును సాధించారని విశ్వం విద్య సంస్థల అధినేత డా.. యన్.విశ్వ నాథ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగ ఉతమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విశ్వం విద్య సంస్థల అధినేత డా. యన్. విశ్వ నాథ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ యన్. విశ్వ చందన్ రెడ్డి విద్యార్థిని, తలిదండ్రులు ఏ. శివ ప్రసాద్, ఏ. లక్ష్మీ దివ్య లను జ్ఞాపికతో అభినందించారు .ఈ కార్యక్రమంలో విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ.. గత 32 సంవత్సరాలుగా జాతియ స్థాయిలొ జరిగే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షలకు తమ సంస్థలో శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సదిస్తునట్ల తెలియచేశారు.ఈ ఫలితాలు సాధించడానికి కృషీ చేసిన ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థుల తలిదండ్రులకు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement