Wednesday, May 22, 2024

ధర్మారెడ్డిని సాగనంపే వరకు పోరాటం కొనసాగుతోంది : రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ

తిరుపతి సిటీ : టిటిడి అదనపు ఈవో ధర్మ రెడ్డిని సాగనంపే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలిపారు. శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద ధర్మ రెడ్డిని సాగనంపాలని పిలుపునివ్వడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జి సుగుణమ్మ, తెలుగు యువత నాయకులు రవి నాయుడు, ఇలా పలువురు టిడిపి నాయకులను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అని తెలియజేశారు. తిరుమలలో అదనపు ఈవో ధర్మ రెడ్డిని అక్రమంగా కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల పవిత్రతను భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైనా నా పోరాటానికి పిలుపునిస్తే పోలీసులు దగ్గర అరెస్టు చేయించడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి ని ఈవో నుంచి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement