Monday, April 29, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ లలిత్‌కు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో
ఎవి.ధ‌ర్మారెడ్డి రెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇత‌ర ప్రముఖులకు తీర్థ ప్రసాదాలు, 2023 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను చైర్మన్‌ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement