Sunday, April 28, 2024

వ్యాక్సిన్లు 45 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరికి వేయాలి .. కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్

శ్రీకాళహస్తి – పురపాలక సంఘం పరిధిలో ఉన్న పలు పెట్రోల్ బంకులను మరియు వార్డు సచివాలయం లను మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా కమిషనర్ వార్డు సచివాలయం నందు 45 సంవత్సరాలు పైబడి 65 సంవత్సరాల లోపు వారికి వాక్సినేషన్ ప్రక్రియ ఎంత పూర్తి అయింది ఇంకా ఎంతమంది వ్యాక్సిన్ వేసుకోలేదు వారి వివరాలను సచివాలయ సిబ్బంది దగ్గర్నుంచి తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ లకు వచ్చు కస్టమర్లకు సిబ్బందికి మాస్కులు ధరించుకోవాలని లేనిపక్షంలో అపరాధ రుసుములను వేయబడును నని హెచ్చరించచారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జి మెడికల్ ఆఫీసర్ చంద్ర మోహన్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement