Saturday, April 27, 2024

రూ.కోటి విలువైన‌ ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌..11 మంది స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుమలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలు భారీగా పట్టుబడ్డాయి. తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 85దుంగలను పోలీసులు సీజ్ చేశారు. 11మంది స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement