Thursday, April 18, 2024

అరుణాచల్ ప్రదేశ్‌లోని.. మొదటి గ్రీన్‌ఫీల్డ్ డోనీ పోలో ఎయిర్‌పోర్ట్ ని ప్రారంభించిన.. ప్రధాని మోడీ

దేశంలో తమ ప్రభుత్వం వర్క్ కల్చర్ తీసుకువచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. తాను అరుణాచల్‌కు వచ్చినప్పుడల్లా.. తనలో కొత్త ఉత్సాహం వస్తుందని ప్రశంసించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది కాకుండా.. 600 మెగావాట్ల మెంగ్ జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ. 8,450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఈ విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశామని,ఈ అదృష్టం తనకు దక్కిందని అన్నారు. తమ ప్రభుత్వం వర్క్ కల్చర్ ను తీసుకొచ్చిందని అన్నారు.

సంస్కృతి లేదా వ్యవసాయం, వాణిజ్యం లేదా కనెక్టివిటీ అయినా, ఈశాన్య ప్రాంతాలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 2019లో తాను ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినప్పుడు ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఈ శంకుస్థాపన చేశానని, విమానాశ్రయం కట్టడం లేదని, ప్రతిపక్షలు ..బీజేపీపై రాళ్లు రువ్వరని అన్నారు.నేటి ప్రారంభోత్సవం వారికి చెంపపెట్టులాంటిదనీ, నేడు దేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతోన్నాయని, దేశ ప్రజల అభివృద్ధే.. తమ ప్రభుత్వం ప్రాధాన్యత అన్నారు. ఏడాదికి 365 రోజులు, 24 గంటలూ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రానంతరం ఈశాన్య ప్రాంతాలు భిన్నమైన యుగానికి సాక్ష్యమిచ్చాయని ప్రధాని అన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందనీ, అటల్ జీ ప్రభుత్వం వచ్చాక తొలిసారి ఈ ప్రాంతంలో మార్పు ప్రారంభమైందనీ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం ఇదేననీ, ప్రస్తుత ప్రభుత్వం కూడా దేశంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడం లక్యంగా పెట్టుకుందన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిలో విమానాశ్రయం ఉండాలనేది తన కల అని అన్నారు. ప్రధాని మోడీ కృషితో ఆ కల నేడు నెరవేరిందనీ, ఈ విమానాశ్రయ నిర్మాణానికి ప్రధాని మోడీ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రాజధానికి సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడం. దేశంలోని అన్ని ప్రాంతాలకు తన రాష్ట్రంలోని ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేయడం,వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మెరుగుపరచడం. మెరుగైన చికిత్స కోసం రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement