Saturday, April 27, 2024

ప్రజా సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే భూమన‌

తిరుపతి సిటీ : వైయస్సార్ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు వైయస్సార్ ప్రభుత్వంలో అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే భూమన‌ కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం. 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన‌ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ను పూర్తిస్థాయిలో పరిష్కరించే అందుకే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికున్న సమస్యలను వివరించాలని వాటిని పరిష్కరించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, ఎస్.కే .బాబు, వైఎస్ఆర్సిపి నాయకులు సునీల్, వేస్ట్ సిఐ. శివప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement