Tuesday, May 21, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపటి కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి పలమనేరు డీఎస్పీ నోటీసులిచ్చారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులిచ్చారు. తాజాగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో డీటెల్స్ ను ఆయన కార్యదర్శి పోలీసులకు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement