Thursday, April 25, 2024

శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement