Monday, April 29, 2024

పెట్రోల్ బంకుల్లో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు

తిరుపతి సిటీ : తిరుపతి నగరంలో సోమవారం లీగల్ మెట్రాలజీ స్క్వాడ్ విస్తృతంగా పెట్రోల్ బంకుల్లో త‌నిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రేణిగుంట సమీపంలో ఉన్న తేజ సర్వీస్ స్టేషన్ నందు తనిఖీలు నిర్వహించగా ఐదు లీటర్ల పెట్రోల్ గాను 30 ఎమ్ఎల్ నాజిల్స్ నందు తక్కువగా ఉండడంతో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులు కొనసాగిస్తూ ఉంటామని తెలియజేశారు. ఇటీవల కాలంలో పెట్రోల్ బంకులపై పలు ఆరోపణలు రావడంతో తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్, సుబ్బారెడ్డి, డిప్యూటీ కంట్రోలర్ దయాకర్ రెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్, అసిస్టెంట్ కంట్రోలర్ అప్పలరాజు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement