Friday, May 17, 2024

తిరుమలలో మంత్రి ఉషశ్రీ అనుచరుల హల్చల్

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులు హల్ చల్ చేశారు. ఆమె తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్.. 50 మంత్రి అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 10 సుప్రభాతం టికెట్లను పొందారు. ఇక, భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఓ వీడియో జర్నలిస్టును నెట్టేశారు. ఇక, మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ ఈ టికెట్లను జారీచేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ సాధారణ భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement