Sunday, May 19, 2024

గోవిందరాజ్ స్వామి ఆలయానికి బంగారు తాపడం

తిరుపతి సిటీ : తిరుపతి గోవింద స్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులను టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. చాలా విశిష్ట కలిగిన ఆలయం గోవిందరాజ స్వామి గుడి అన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు గోవిందస్వామిని దర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం అవతారన్నారు. ఈ నేపథ్యంలో గోవిందరాజు స్వామి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో విమాన గోపురానికి బంగారు కాపురం చేయాలని టిటిడి నిర్ణయించిందని వివరించారు.

2109లో విమాన గోపురానికి బంగారు కాపురం చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య‌ కారణాలు చేత వాయిదా పడింది అన్నారు. ప్రస్తుతం రాగి పనులు పూర్తయ్యాయ‌ని మిగిలిన బంగారు తాకుడు పనులు అక్టోబర్ నెల చివరి కల్లా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇందుకుగాను రూ.50 కోట్లు విలువ చేసే 100 కేజీలు బంగారాన్ని టీటీడీ ట్రెజరీ నుండి విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement