Thursday, May 2, 2024

రోడ్డుప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు

రోడ్డుప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున పలమనేరు జాతీయ రహదారిలోని అరగొండ మధురం హోటల్‌ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరిడివారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దినేశ్‌ కుమార్‌ రెడ్డి (23), అతడి స్నేహితులు ఉదయ్‌, నరేశ్‌, మరో ద్విచక్రవాహనంపై ఉన్న వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేశ్‌కుమార్‌ రెడ్డి మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement