Thursday, April 25, 2024

Tirupati rains: వరద బాధితులను ఆదుకోండి: ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి

వాయుగండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వర్షాలకు అతలాకుతలమైంది. తిరుపతిలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం చిరు ఓ ట్వీట్‌ చేశారు. ”గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement