Friday, May 3, 2024

AP: తుఫాన్ పై జిల్లా అధికారుల‌తో ముఖ్యమంత్రి సమీక్ష

శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో, డిసెంబర్ 04: (ప్రభన్యూస్)
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాను / భారీ వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.  అరుణ్ బాబు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. మాధవ రెడ్డి, సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్ , డిఆర్ఓ  కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుఫాన్, భారీ వర్షాలు కారణంగా తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రోడ్లు భవనాల ఎస్ఈ సంజీవయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement