Tuesday, May 21, 2024

AP: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడలో దళితులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితభూముల్లో మట్టి తవ్వకాలు, దాడులను లేఖలో వివరించారు. దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. వైసీపీ ఎమ్మెల్యే, వారి అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement