Sunday, April 28, 2024

వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబు పని.. సజ్జల

వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబు పని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అబద్దాలు ఎలా చెప్పాలో టీడీపీ నేత చెంగల్ రాయుడు పార్టీ మీటింగ్ లోనే చెప్పారన్నారు. శిక్షణా తరగతుల్లో చంద్రబాబు ముందే చెంగల్ రాయుడు మాట్లాడారన్నారు. రౌడీలు, అబద్దాల కోరులతో జన్మభూమి కమిటీలు వేశారన్నారు. బూతులు తిట్టడంతో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టింక్షన్ వస్తుందన్నారు. పట్టాభికి బూతులు నేర్పించ ఆంబోతులా ప్రజలపైకి వదిలారన్నారు. బూతులు తిడుతూ అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా అని సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వం, పార్టీ ఎప్పుడు మంచిపని చేసినా దాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement