Friday, May 10, 2024

Breaking: సీఐడీ కార్యాలయంలో పూచీకత్తు సమర్పించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో ఆయన పూచీకత్తు సమర్పించారు. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని బెయిల్ షరతులు విధించింది. దీంతో చంద్రబాబు సీఐడీకి కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారిని కలిశారు.

ఇదే కేసుల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీరికి సైతం హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చెబుతూ చంద్రబాబు సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement