Wednesday, May 8, 2024

చంద్రబాబు ముసలి సైకో.. అంబటి రాంబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముసలి సైకో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చేసింది అట్టర్ ఫ్లాప్ షో అన్నారు. సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు జనాలు రాలేదన్నారు. జనాలు రాకపోయినా మహా అద్భుతంగా కార్యక్రమం జరిగిందనడం టీడీపీ ఖర్మ అన్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని అన్నారు. నన్ను చంద్రబాబు ఆంబోతు అంటాడా అన్నారు. తాను మైనింగ్, ఇసుక మాఫియా చేస్తున్నానా అని అడిగారు. గుండెల మీద చెయ్యి వేసి చెబుతున్నా.. బాబు కన్నా, లోకేష్ కన్నా, కోడెల కన్నా నీతిమంతుడినని అంబటి రాంబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement