Wednesday, May 1, 2024

ఇక్కడ చంద్ర‌బాబు, అక్కడ లోకేశ్‌.. తెలుగుదేశం పార్టీ 40 వ‌సంతాల వేడుక షురూ..

తెలుగుదేశం పార్టీ 40 వ‌సంతాల వేడుక‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల్లో సంబురంగా ప్రారంభ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఆద‌ర్శ న‌గ‌ర్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పేరును ప్ర‌క‌టించిన చోటుకు వెళ్లిన పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు వేడుక‌ల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. చంద్ర‌బాబు వెంట రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, బ‌క్క‌ని న‌ర్సింహులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు త‌ర‌లివచ్చాయి..

అదేవిధంగా.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మంగ‌ళ‌గిరిలో పార్టీ 40 ఏళ్ల పండుగ వేడుక‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు నిర్వ‌హించిన బైక్ ర్యాలీలో లోకేశ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ40 వ‌సంతాల వేడుక‌ల‌ను ఏపీ, తెలంగాణ‌తో పాటు విదేశాల్లోనూ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement