Thursday, April 25, 2024

కాంట్రాక్టర్లకు రూ.80 వేల కోట్ల బకాయిలు: జగన్ పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోర్టులు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులా? అని మండిపడ్డారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందన్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: అవి నవరత్నాలు కాదు.. నవరంధ్రాలు: చింతా మోహన్ సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement