Sunday, May 5, 2024

బస్సు ప్రమాదం పై చంద్రబాబు దిగ్బ్రాంతి

అమరావతి:- ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 7 గురు మృతిచెందడపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి కి చెందిన పెళ్లి బృందం బస్సు కాలువలోకి దూసుకువెళ్లిన ప్రమాదంలో 7గురు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు నాయుడు కోరారు. వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయన్న చంద్రబాబు….బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement