Monday, April 29, 2024

Tirumala: ఎస్వీ మ్యూజియం పనులకు శంకుస్థాపన చేసిన చైర్మన్ భూమన

తిరుమల : ఎస్వీ మ్యూజియం పనులుకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ… శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలిపేలా ఎస్వీ మ్యూజియంని అభివృద్ది చేస్తామన్నారు.

రూ.145 కోట్ల వ్యయంతో మ్యూజియాన్ని ఆధునాతమైన సౌకర్యాలతో అభివృద్ది చేస్తామన్నారు. టీసీయస్, మ్యాప్స్ సంస్థ రూ.145 కోట్ల విలువైన పనులను విరాళంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ కల్లా మ్యూజియం అభివృద్ది పనులు పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement