Friday, April 26, 2024

10 న రండి….అవినాష్ రెడ్డికి సీబిఐ మరో‌సారి నోటీస్ లు

.L12 న రావాలని ఆయన తండ్రికి

కడప,ప్రభు న్యూస్ బ్యూరో. – మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని ఈ నెల పదవ తేదీన విచారణకు రావాలని సి.బి.ఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. రెండు రోజుల క్రితం ఈనెల 6న అంటే సోమవారం హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తనకు ముందుగా అనుకున్న పలు కార్యక్రమాలు ఉన్నందున రాలేకపోతున్నానని అవినాష్ చెప్పడం జరిగింది .ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి మరోసారి నోటీస్ ఇస్తూ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.ఇదిలా ఉంటే ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా ఈనెల 12న కడపలో జరిగే సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా 12న హాజరుకానున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement