Wednesday, May 8, 2024

ఎక్సైజ్ అధికారుల‌పై కేసులు న‌మోదు

ఎక్సైజ్ పోలీసు అధికారుల‌పై కేసులు న‌మోదు చేసిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనపల్లిలోని ఓ బార్ లో దౌర్జన్యానికి దిగిన ఎక్సైజ్ సీఐ జవహర్, ఎస్సై సురేష్ బాబులపై పోలీసు కేసు నమోదు చేసారు. పట్టణంలోని ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్ లో అనధికార యాజమాన్య వాటాను ఎక్సైజ్ సీఐ జవహర్ కొనసాగించారు. అయితే లావాదేవీల విషయంలో బార్ లీజుదారు శివతో సీఐ జవహర్ గొడవపడ్డాడు. దీంతో ఎస్సై తో పాటు మరో 30 మందిని వెంట తీసుకెళ్లి బార్ లో సీఐ జవహర్ దౌర్జన్యానికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో బార్ లీజు దారు శివ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు… ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement