Saturday, April 27, 2024

టీడీపీ నేత బొండా ఉమాపై కేసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్ గా కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ అయి.. బైయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement