Thursday, April 25, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు గత తొమ్మిది నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల ఈ నెల 31వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వనున్నారు. ఈ నెల 31న మధ్యాహ్నం 2.గంటలకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో నిర్వహించే ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి’ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడతారా? కేంద్రంపై విమర్శలు చేస్తారా? అన్నది ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: ఏపీలో చెత్తపై పన్ను ఎందుకో చెప్పిన ఎమ్మెల్యే రోజా

Advertisement

తాజా వార్తలు

Advertisement