Friday, April 26, 2024

మాన్సాస్ ఛైర్మన్ అశోక్ పై కేసు నమోదు

మాన్సాస్ ఛైర్మన్ అశోక్ పై కేసు మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాన్సాస్ చైర్మన్, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయ్యాయి. ఈవో వెంకటేశ్వరరావు తమ వేతనాలు నిలిపేశారంటూ మూడు రోజులక్రితం మాన్సాస్ చైర్మన్ ను ఉద్యోగులు కలిసిన విషయం తెలిసిందే. కష్టం వచ్చిందని చెప్పుకునేందుకు వెళ్లిన తమతోపాటు మాన్సాస్ చైర్మన్ పై కేసు పెట్టారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాన్సాస్ ట్రస్ట్ ఈవో గత 19 నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని… ఈ నెల 17న అశోక్ గజపతిరాజు వద్ద మాన్సాస్ ఉద్యోగులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం ఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాలను ఎందుకు ఇవ్వడం లేదని ఈవోను నిలదీశారు. ఈ క్రమంలో ఈవోకు, ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ పై పోలీసులు కేసు పెట్టారు. అశోక్ గజపతిరాజు, ట్రస్ట్ కరస్పాండెంట్ సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement