Monday, April 29, 2024

కారు దగ్ధం.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కారులో మంట‌లు చెల‌రేగాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న కారులో షార్ట్‌ సర్క్యూట్ సంభ‌వించ‌డంతో కారు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ఆరుగురు ప్రయాణికులు కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు వద్దకు చేరుకోగానే పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కారు మొత్తం దగ్ధమైంది. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి సమాచారం అందించ‌డంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement