Sunday, May 19, 2024

బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ పై కారు బీభత్సం.. పారిశుధ్య కార్మికుల పైకి దూసుకెళ్లడంతో..

విజయవాడ కార్పొరేషన్: విజయవాడ బెంజ్​ సర్కిల్​ ఫ్లై ఓవర్​పై ఇవ్వాల (సోమవారం) ఓ కారు బీభత్సం సృష్టించింది. కారులో వచ్చిన వ్యక్తి ఇష్టమున్నట్టు నడపడంతో అక్కడున్న వారిమీదకు దూసుకెళ్లింది. విజయవాడ నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఫ్లై ఓవర్ పై రోడ్లను శుభ్రం చేస్తుడగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు షేక్ నాగర్ బీ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సీరియస్​గానే ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement