Friday, April 26, 2024

Breaking: తిరుప‌తిలో దారుణ హ‌త్య‌.. స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ‌కే గొంతుకోసి చంపేశారు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): తిరుప‌తి జిల్లా కేంద్రంలో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తిని గొంతుకోసి చంపేసిన ఘ‌ట‌న ఇవ్వాల (సోమ‌వారం) రాత్రి జ‌రిగింది. ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలమేర‌కు.. గ్రూప్ థియేటర్ సమీపంలో పండు (35) అనే వ్య‌క్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. సంవత్సర కాలంగా ప‌లు చోట్ల పని చేసుకుంటూ.. సాయంత్రం అయితే మడత మంచాల వ‌ద్ద నిద్రిస్తూ ఉండేవాడు.

మత్తుకు బానిసై గంజాయి, మద్యం సేవిస్తూ ఉండేవాడు. మద్యం మత్తులో కొంతమందితో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో మాట మాట పెరిగి గొంతు కోసి చంపేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ర్డ‌ర్ సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి ప‌రిశీలించామ‌ని , సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని, నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement