Monday, May 6, 2024

కామ పిశాచి.. సొంత చెల్లిపైనే అఘాయిత్యం

నేటి సమాజంలో కొందరు కామాంధులు వావి వరుసలు కూడా మర్చిపోతున్నారు. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి చిన్నపెద్దా, అక్క, చెల్లి అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే తిరుపతిలో చోటుచేసుకుంది. 14 ఏళ్ల ఓ మైనర్ బాలికపై అన్న అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి శివారు‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చంద్రగిరి మండలానికి చెందిన మహిళను 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు.  అయితే, కొడుకు పుట్టిన కొన్నాళ్లకే ఆ మహిళ భర్త నుంచి విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకుని కుమారుడితో పాటు  వడమాలపేటలో నివాసముంటోంది. మొదటి భార్యతో విడిపోయిన తరువాత ఆ వ్యక్తి ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. రెండో కుమార్తెకు ప్రస్తుతం 14 సంవత్సరాలు.  ప్రస్తుతం తిరుపతి శివార్లలోని ఓ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు.  మొదటి భార్య కుమారుడు అప్పుడప్పుడూ తిరుపతిలోని తన తండ్రి, చిన్నమ్మ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఐదు నెలలక్రితం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన చెల్లెలైన 14 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆ బాలిక ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. ఆమె శరీరంలో కలుగుతున్న మార్పులను గుర్తించిన బాలిక తల్లి ఆమెను ప్రశ్నించగా… అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో బాధితురాలు, ఆమె తల్లి అలిపిరి పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement