Sunday, May 19, 2024

Breaking : పలు సంఘాలతో స‌మావేశ‌మైన‌ బ్రదర్ అనిల్

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బావ బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ఏపీలో ప‌లు సంఘాల నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. విజయవాడలోని ఓ హోటల్‌లో పలు సంఘాలతో బ్రదర్ అనిల్ నిర్వ‌హించిన సమావేశానికి బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశామ‌న్నారు. అయితే ఇప్పుడు సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదన్నారు. బీసీ సంఘం నేత నాగ‌రాజు మాట్లాడుతూ… సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామ‌న్నారు. బ్రదర్‌ అనిల్‌ చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశామ‌న్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని ఆయన్ను కోరామ‌న్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ కావాల‌ని మ‌రికొంద‌రు నేత‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement