Friday, May 3, 2024

Breaking : ఫార్మా కంపెనీలో పేలిన రియాక్ట‌ర్..ఒక‌రు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఓ ఫార్మా కంపెనీలో రియాక‌ర్ట పేలింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఈ ప్రమాదం సంభవించింది. లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement