మచిలీపట్నం – ప్రభ న్యూస్: కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా కోర్టు కాంపౌండ్ లోని ఎక్సైజ్ కోర్టు లో సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఎక్సైజ్ కేసుకు సంబంధించి బాధితుడు వద్ద నుంచి ఏపీపీ జరబాల విజయలక్ష్మి, ఎక్సయిజ్ కానిస్టేబుల్ బాల కృష్ణ లు రూ . 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒకసారిగా దాడి చేసి పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, నిందితుల ఇద్దరిని అరెస్ట్ చేశారు… కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో ఏ ఎస్ పి స్నేహిత, డీఎస్పీ లు శ్రీనివాస్,శరత్ లు పాల్గొన్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/08/IMG-20230828-WA0030-1024x870.webp)