Sunday, May 19, 2024

NZB: మంత్రి వేముల సమక్షంలో.. బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు

వేల్పూర్, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వేల్పూర్ మండలం పడగల్, హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ నగర్ సర్పంచి అల్లెపు ముతేమ్మ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పడగల్, హనుమాన్ నగర్ గ్రామాల సర్పంచి ద్యవతి వర్షిణి, సర్పంచి పల్లపు ముత్తేమ్మ, ఉప సర్పంచ్ లు, బీఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సూత్రాల మహేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement