Wednesday, May 15, 2024

Breaking: స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్.. ప‌లువురికి తీవ్రగాయాలు.. హాస్పిట‌ల్‌కు త‌ర‌లింపు

Police Action: అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌ఎస్‌బీయన్‌ ఎయిడెడ్ కాలేజీ ఎదుట స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు. ఎయిడెడ్‌ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆగ్ర‌హించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించడంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. తలలు పగిలేలా కొట్టించడం సీఎం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం అని విద్యార్థి సంఘం నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని ఖండించాయి ప‌లు విద్యార్థి సంఘాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement