Friday, May 17, 2024

గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే ఆ ప‌ని..

హైదరాబాద్‌(ప్రభ న్యూస్‌): గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంటిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాలో చోటుచేసుకుంది. ఆదివారం సీఐ బిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లోని గోదావరి గార్డెన్స్‌ ప్లాట్‌ నంబర్‌ 19బి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఏడు గంజాయి మొక్కలను పెద్ద కుండిలో పెంచుతున్నాడని సమాచారంతో జవహర్‌నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటిలో మొక్కలను పరిశీలిం చారు. సమాచారం వాస్త‌వం కావ‌డంతో గంజాయి మొక్కలను పెంచుతున్న నర్సింహాశాస్త్రిని (53) వెట‌నే అరెస్టు చేసి జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. అనంతరం అల్వాల్‌ డిప్యూటి తహసీల్దార్‌ పంచానామ నిర్వహించి గంజాయి మొక్కలను సీజ్‌ చేసి నిందితున్ని జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement