Wednesday, May 1, 2024

Break – జ‌న‌సేనాని వారాహి విజ‌య‌యాత్ర‌కు రెండు రోజులు బ్రేక్ ….

భీమ‌వ‌రం – జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో వారాహి విజ‌య యాత్ర పేరుతో ప‌ర్య‌ట‌న చేస్తున్నారు.. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు రెండు రోజులు విరామం ప్ర‌క‌టించారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప‌వాస దీక్ష‌లో ఉండ‌టంతో ఆయ‌న స్వల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.. దీంతో భీమ‌వ‌రంలో నేడు జ‌ర‌గాల్సిన పార్టీ కార్య‌కర్త‌ల స‌మావేశాన్ని కొన్ని గంట‌లు వాయిదా వేసి అనంత‌రం నిర్వ‌హించారు..

వైద్యుల ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవల్పిందిగా సూచించారు.. దీంతో రెండు రోజుల పాటు వారాహి విజ‌య యాత్ర‌ను వాయిదా వేస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement